వార్తలకు తిరిగి వెళ్లండి
జైన్ సంఘం ఆధ్వర్యంలో ఈనెల 26న ఉచిత కంటి వైద్య శిబిరం

చిత్తూరు జైన్ సంఘం, తిరుపతి ఎస్.వి. అరవింద్ ఐ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈ నెల 26న శ్రీ జైన్ ప్రార్థనా మందిరంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరగనుంది. ఉదయం 7 నుండి 10 గంటల వరకు పరీక్షలు చేసి, ఆపరేషన్ అవసరమైన వారికి ప్రయాణం, భోజన వసతులతో ఉచితంగా శస్త్రచికిత్స చేస్తారు. ప్రజలు ఆధార్ కార్డు జిరాక్స్, మాస్క్తో రావాలని సుభాష్ జైన్ తెలిపారు. గత నెలలో ఆపరేషన్ అయిన 67 మందికి రివ్యూ చెకప్ కూడా ఉంటుంది.
Comments
Loading comments...