వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్లో క్షిపణుల దృశ్యాలను మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన జగిత్యాల జిల్లా గుల్లపేటకు చెందిన గోపు భూమేశ్(26)ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉపాధి కోసం గతేడాది దుబాయ్ వెళ్లిన అతడిపై దేశద్రోహం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న అతడి కుటుంబ సభ్యులు.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని భూమేశ్ను సురక్షితంగా విడిపించాలని వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

