వార్తలకు తిరిగి వెళ్లండి
హైదరాబాద్లో జగన్నాథ యాత్ర

హైదరాబాద్లో గురువారం ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర సాయంత్రం 6 గంటలకు ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకుంటుంది.
సుమారు లక్ష మంది భక్తులు పాల్గొనే ఈ రథయాత్ర కోసం నిర్వాహకులు భారీగా ప్రసాదాన్ని సిద్ధం చేస్తున్నారు. భక్తులంతా పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని ఇస్కాన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...