వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్లో వర్షాల సమయంలో అధికారుల సమన్వయ లోపంపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షం వస్తే కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అంతా రోడ్లపైనే ఉండి విధులు నిర్వహించాలని, అవసరమైతే తానూ వస్తానని స్పష్టం చేశారు.
రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయితే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రాజెక్టుల మరమ్మతులకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, ట్రాఫిక్ విభాగంలో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

