Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలపాతంలో ఐటీ ఉద్యోగి మృతి

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Aug 07, 2026 8:34 PM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
జలపాతంలో ఐటీ ఉద్యోగి మృతి - Udayam Digital
ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలానికి చెందిన ఐటీ ఉద్యోగి చెరుకూరు శివరామకృష్ణ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు సమీప జలపాతంలో మునిగి మృతిచెందాడు. విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్నేహితులు గాలించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. రెండేళ్ల క్రితమే వివాహమైన శివరామకృష్ణకు పది నెలల కుమారుడు ఉన్నాడు.

Comments

G
Loading comments...