వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పాలన వైఫల్యంపై మెదక్ ఎంపీ రఘునందన్రావు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్రెడ్డికి అసెంబ్లీని రద్దు చేసే ధైర్యముందా అని ప్రశ్నిస్తూ, అలా చేస్తే తాము 8 మంది భాజపా ఎంపీలం రాజీనామా చేయడానికి సిద్ధమని సవాలు విసిరారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం, రైతు సమస్యలపై ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా బలోపేతమవుతోందని రఘునందన్రావు కొనియాడారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో పారదర్శకంగా ఉన్నాయని పేర్కొన్నారు
Comments
Loading comments...

