వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలోని గ్రామీణ బ్రాంచ్ పోస్టాఫీసుల్లో ఇకపై అంతర్జాతీయ మెయిల్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తపాలా శాఖ జిల్లా సూపరింటెండెంట్ వి. హరిబాబు సోమవారం తెలిపారు.
గతంలో విదేశాలకు లేఖలు, పార్సిళ్లు పంపే సదుపాయం కేవలం పట్టణ పోస్టాఫీసులకే పరిమితమై ఉండగా, ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకూ ఈ సౌకర్యం కల్పించామన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

