Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్‌

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 02, 2026 9:40 PM ఆల్ ఇండియా జాతీయ
అంతరాష్ట్ర దొంగలు అరెస్ట్‌ - Udayam Digital
గజపతి జిల్లా పర్లాఖెముండిలో రూ.5 లక్షల చోరీ కేసులో ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకు నుంచి నగదు తీసుకొచ్చిన బాధితుడి దృష్టి మరల్చేందుకు చిల్లర నాణేలు చల్లి సొమ్ము అపహరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన నిందితులపై ఒడిశాలోని పలు పోలీస్‌స్టేషన్లలో మరో 10 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...