Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Follow Udayam on Google
S kumar Aug 14, 2026 10:26 PM పెద్దపల్లితెలంగాణ
జల్సాలకు అలవాటుపడి వైన్‌షాపుల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను రామగుండం బసంత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 28 తులాల బంగారం, ఆటో, రూ.7 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రాంరెడ్డి తెలిపారు. అరెస్టయిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నారని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...