వార్తలకు తిరిగి వెళ్లండి
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు
భవ్య శ్రీ Jun 25, 2026 4:49 AM నాగర్ కర్నూల్ 5 views1 day ago

రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసి, లబ్ధిదారులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.
రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్లను నిర్మించనున్నామని, ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల చొప్పున ప్రభుత్వం కేటాయిస్తోందని ఆయన స్పష్టం చేశారు. పేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
Comments
Loading comments...