వార్తలకు తిరిగి వెళ్లండి
భారత సంతతి విద్యార్థికి అమెరికా అవార్డు

భారత సంతతి విద్యార్థి అక్కు కుమార్ అంకుర సంస్థ 'యారో అనాలటిక్స్' అమెరికాలో 11,000 డాలర్ల అవార్డు గెలుచుకుంది. విమాన బోర్డింగ్ వద్ద లగేజీ సమస్యల నివారణకు 'ఈజెడ్ బోర్డ్' ఏఐ పరికరాన్ని తెచ్చినందుకు ఈ గుర్తింపు దక్కింది.
టెక్సాస్ ఏఅండ్ఎం పోటీలో ఈ విజయం సాధించారు. ఏఐ కెమెరాలతో హ్యాండ్ బ్యాగేజీని పర్యవేక్షించే ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి బహుమతి మొత్తం ఉపయోగపడుతుందని అక్కు తెలిపారు.
Comments
Loading comments...