వార్తలకు తిరిగి వెళ్లండి
రష్యా రాయబారికి భారత్ సమన్లు

ఉక్రెయిన్లోని ఒడెస్సా పోర్టు వద్ద వాణిజ్య నౌకపై రష్యా జరిపిన దాడిలో నలుగురు భారత నావికులు మృతి చెందడంపై భారత విదేశాంగ శాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా దౌత్యవేత్త వ్లాదిమిర్ లడనోవ్కు సమన్లు జారీ చేసింది.
వాణిజ్య నౌకలపై దాడులు చేయడం, అమాయక పౌరుల ప్రాణాలు తీయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని రష్యాను ఆదేశించింది.
Comments
Loading comments...