వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్వీఎం3-ఎం6 ప్రయోగంతో అంతర్జాతీయ వాణిజ్య ప్రయోగ మార్కెట్లో భారత్ స్థానం బలపడిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ప్రయోగంలో 6,100 కిలోల బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
ఎల్వీఎం3 అత్యంత భారీ పేలోడ్ను మోసిన భారత రాకెట్గా నిలిచిందని తెలిపారు. ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఇన్-స్పేస్ ద్వారా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
