వార్తలకు తిరిగి వెళ్లండి
ఉద్యాన పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలి

వరి, పత్తి పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సూచించారు. ధరూర్ మండల రైతు వేదికలో విత్తన మేళాను ప్రారంభించి రైతులకు పలు సూచనలు చేశారు.
వ్యవసాయ అధికారుల సలహాల మేరకు పంటల సాగు చేపట్టాలని, వర్షాభావ పరిస్థితుల్లో పంటలను సంరక్షించే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...