వార్తలకు తిరిగి వెళ్లండి

అర్పపెల్లి గ్రామంలో ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు చోరీ చేసిన కేసుతో పాటు పలు ప్రాంతాల్లో బైక్ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను సారంగాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ నెల 18న అర్పపెల్లిలో జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, శుక్రవారం ఎక్స్రోడ్ వద్ద అనుమానాస్పద సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది.
Comments
Loading comments...

