వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవక్కపేట్ అడవిలో చిరుతపులి మృతి ఘటన తర్వాత పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో భారీ అక్రమ ఆయుధాలు బయటపడ్డాయి. అనుమానాస్పదంగా సంచరిస్తున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు జరిపిన సోదాల్లో ఎనిమిది దేశవాళీ తుపాకులు, లైసెన్స్ లేని ఆయుధాలు లభించాయి. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటను అరికట్టడానికి ఈ ఆపరేషన్ చేపట్టామని, చిరుత మృతికి వీరికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

