వార్తలకు తిరిగి వెళ్లండి
అక్రమ మట్టి తవ్వకాలపై అధికారుల చర్యలు

జగిత్యాల మండలం తాటిపల్లి శివారులో పాఠశాల కోసం భూమి చదును నెపంతో ప్రజాప్రతినిధి అక్రమంగా మట్టి తోడేయడంపై మైనింగ్ అధికారులు స్పందించారు. రూ. 20 లక్షల విలువైన మట్టి, చెట్లను తరలించారనే కథనంతో సదరు నేత నుంచి రూ. 58 వేలు వసూలు చేశారు.
అనుమతులకు మించి చెట్లను నరికి మట్టి విక్రయించిన సదరు ప్రజాప్రతినిధికి అధికారుల ఆదేశాల మేరకు తవ్వకాలు నిలిపివేయాల్సిందిగా హెచ్చరించారు.
Comments
Loading comments...