వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుక బట్టీల కోసం చెరువుల నుండి నల్లమట్టిని యథేచ్ఛగా తరలిస్తున్నారు. వానాకాలంలో చెరువులు నిండిపోతాయనే నెపంతో ముందే భారీగా మట్టిని నిల్వ చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు.
జిల్లాలో వందకు పైగా బట్టీలు నడుస్తుండగా, కేవలం 25 మందికి మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. గనులు, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ అక్రమ దందా జోరుగా సాగుతోందని విమర్శలు వస్తున్నాయి.
Comments
Loading comments...

