వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల మార్చురీల్లో సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మృతుల కుటుంబాల దుఃఖాన్ని ఆసరాగా చేసుకుని, పోస్టుమార్టం కోసం వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. చాపలు, బ్లేడ్ల వంటి సామాగ్రి కోసం కూడా అధిక ధరలు వసూలు చేస్తూ బాధితులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
మరోవైపు ఆసుపత్రుల్లో ఫ్రీజర్ల కొరత, మౌలిక వసతుల లేమితో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, వసతులు కల్పించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

