వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
గచ్చిబౌలిలో ప్రమాదం: యువతి దుర్మరణం

గచ్చిబౌలి ఫ్లైఓవర్ వద్ద వాటర్ ట్యాంకర్ ఢీకొట్టిన ప్రమాదంలో మల్లం భవానీ అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఎస్.సుభాషిణిని చికిత్స నిమిత్తం హిమగిరి ఆస్పత్రికి తరలించారు.
ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...