Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈతవనాల ఏర్పాటుకు భూములు కేటాయించాలని వినతి

Follow Udayam on Google
RR REDDY Sep 10, 2026 3:09 PM నిజామాబాద్General
ఈతవనాల ఏర్పాటుకు భూములు కేటాయించాలని వినతి - Udayam
మండలంలోని 13 గ్రామాల గౌడ కులస్తులకు ప్రభుత్వ భూములు గుర్తించి ఈతవనాల ఏర్పాటుకు ఈత మొక్కలు, బోరు మోటారు మంజూరు చేయాలని కోరుతూ గౌడ సంఘం నాయకులు తహసీల్దార్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. మండల గౌడ సంఘం అధ్యక్షుడు రాజు గౌడ్, గౌరవ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ దశ గౌడ్, దత్తాపూర్ నారా గౌడ్ తదితరులు మండల అధ్యక్షుడు గంగుల బాపూరావుతో కలిసి వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...