వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 6వ తేదీ నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా స్టడీ సర్కిల్ అధికారిని అనురాధ తెలిపారు.
మంగళవారం కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ..,ఎంపికైన వారిలో బీసీ 66,ఎస్సీ 20,ఎస్టీ 14 మంది ఉన్నారని,డిగ్రీ మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక చేశామన్నారు.ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో తరగతులు జరుగుతాయని, అభ్యర్థులు హాజరు కావాలని కోరారు.
Comments
Loading comments...

