వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకులో భార్యపై భర్త కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఇరగవరం రోడ్డు కాలనీలో నివాసం ఉంటున్న పులసేరి భవాని, దుర్గాప్రసాద్లకు పదేళ్ల క్రితం వివాహమైంది. ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్న దుర్గాప్రసాద్ ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు.
భార్యపై అనుమానం పెంచుకున్న అతడు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘర్షణకు దిగి కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

