వార్తలకు తిరిగి వెళ్లండి
బంజారాహిల్స్లో భారీ చోరీ

బంజారాహిల్స్లోని ఓ ఎక్స్పోర్టు కార్యాలయంలో జరిగిన భారీ చోరీలో కిలోకుపైగా బంగారు నగలు అపహరణకు గురయ్యాయి. డైమండ్ ఫిక్సింగ్ కోసం లాకర్లో భద్రపరిచిన 1,028 గ్రాముల నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుజరాత్ వ్యాపారి ఫిర్యాదు చేశారు.
వాష్రూమ్ కిటికీ ధ్వంసం చేసి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...