వార్తలకు తిరిగి వెళ్లండి
అనుమతుల్లేకుండానే కార్యాలయం ఎలా కడతారు?: అశోక్గజపతి రాజు

విజయనగరంలో వైకాపా జిల్లా కార్యాలయాన్ని తమ సొంత స్థలంలో నిర్మించారని గోవా గవర్నర్ అశోక్గజపతి రాజు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, చట్టాలను తుంగలో తొక్కి ఈ నిర్మాణం చేపట్టారని ఆయన మండిపడ్డారు.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో రికార్డులు మార్చి తమ ప్రైవేట్ భూమిని ప్రభుత్వ స్థలంగా చూపించారని తెలిపారు. దీనిపై ఏడాది క్రితమే కలెక్టర్కు ఫిర్యాదు చేశామని, గవర్నర్గా బాధ్యతలు చేపట్టకముందే తాను పార్టీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు.
Comments
Loading comments...