వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం మెల్లకుంట తండాకు చెందిన విశ్లవత్ నీల, కోర్ర నరేందర్ ఢిల్లీలోని తపాలా శాఖలో పదోన్నతి పొందారు. గ్రామీణ డాక్ సేవకులుగా సేవలు అందించిన వీరికి గ్రామస్తులు ఘనంగా సన్మానం చేశారు.
పేద గిరిజన కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి ఉద్యోగం సాధించడం అభినందనీయమని కొనియాడారు. తండా యువత వీరిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

