వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలక్ట్రిక్ వాటర్ హీటర్ వాడుతుండగా కరెంట్ షాక్తో స్వాతి(40) అనే మహిళ మృతి చెందింది. ఘటన సమయంలో ఆమె ఇంట్లో ఒక్కరే ఉన్నారు. భర్త ఉద్యోగానికి, పిల్లలు బడికి వెళ్లిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...
