వార్తలకు తిరిగి వెళ్లండి
బిహార్లో హైటెన్షన్ వైర్ చోరీ

బిహార్లో దొంగలు పట్నా-గయా రైల్వే లైన్పై ఉన్న 25వేల వోల్టుల హై-టెన్షన్ ఓవర్ హెడ్ వైర్ను కత్తిరించి ఎత్తుకెళ్లారు. ఆర్పిఎఫ్ పోస్టుకు సమీపంలోనే వంద మీటర్ల మేర వైరు చోరీకి గురికావడం గమనార్హం.
ఈ దొంగతనం వల్ల సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిని, రైళ్ల రాకపోకలు మూడు గంటల పాటు నిలిచిపోయాయి. రైల్వే అధికారులు సింగిల్ లైన్ ద్వారా రైళ్లను నడపాల్సి వచ్చింది.
Comments
Loading comments...