వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యాలయంపై బీజేపీ దాడితో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను గృహనిర్బంధం చేశారు. నగరం అంతటా భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
ముందస్తు చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. బంద్ను అడ్డుకుంటామని బీజేపీ, ఇది వ్యక్తిగత గొడవని కాంగ్రెస్ అనడంతో రాజకీయ సెగ రాజుకుంది. ప్రస్తుతం కరీంనగర్లో భారీ బందోబస్తు కొనసాగుతోంది.
Comments
Loading comments...

