Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవదాయ ట్రైబ్యునల్ చైర్‌పర్సన్‌కు హైకోర్టు నోటీసులు

పవన్ కుమార్ Jul 21, 2026 12:34 PM అమరావతిabout 7 hours ago
దేవదాయ ట్రైబ్యునల్ చైర్‌పర్సన్‌కు హైకోర్టు నోటీసులు - Udayam Digital
ఏపీ దేవదాయ ట్రైబ్యునల్‌ చైర్‌పర్సన్‌గా రిటైర్డ్‌ జిల్లా జడ్జి ఎ.భారతి నియామకం తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం చైర్‌పర్సన్‌కు నోటీసులు జారీ చేసింది. దేవదాయ చట్టంలో తెచ్చిన సెక్షన్ల సవరణలు, జీవో 435ను రద్దు చేయాలని కోరిన పిటిషన్లపై తదుపరి విచారణను సెప్టెంబరు 29కి వాయిదా వేసింది.

Comments

G
Loading comments...