వార్తలకు తిరిగి వెళ్లండి
సీఐ విచారణకు హైకోర్టు ఓకే

సాయికృష్ణ మృతి కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కస్టడీ నిబంధనలను సడలిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో విజయవాడ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ, నాగరాజును కృష్ణలంక పోలీస్స్టేషన్లో విచారించేందుకు అనుమతించింది.
ఈ నెల 9వ తేదీ నుంచి ఎనిమిది రోజుల పాటు ఈ విచారణ జరగనుంది. జైలులోనే విచారించాలన్న లోయర్ కోర్టు నిబంధనను సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
Comments
Loading comments...