వార్తలకు తిరిగి వెళ్లండి
దేశంలో మళ్లీ భారీ వర్షాలు

ఈ నెల 23 లేదా 24న బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న వారం రోజుల్లో ఉత్తర భారతదేశంలో భారీగా, దక్షిణాన మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
ఉపరితల ఆవర్తనం వల్ల ఏపీలోని పలు తీరప్రాంత జిల్లాలతో పాటు తెలంగాణలోని హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...