Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారీ వర్షాల హెచ్చరిక.. ఉత్తరాఖండ్ అప్రమత్తం

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Aug 06, 2026 11:19 AM ఆల్ ఇండియా జాతీయ
భారీ వర్షాల హెచ్చరిక.. ఉత్తరాఖండ్ అప్రమత్తం - Udayam Digital
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం విపత్తు నిర్వహణ సంస్థలను అప్రమత్తం చేసింది. డెహ్రాడూన్ సహా పలు జిల్లాల్లో 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించారు. విపత్తు నిర్వహణ ఏర్పాట్లపై సీఎం పుష్కర్ సింగ్ ధామి సమీక్ష నిర్వహించారు. అత్యవసర కేంద్రాలను 24 గంటలు అందుబాటులో ఉంచి, ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...