వార్తలకు తిరిగి వెళ్లండి
హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాల హెచ్చరిక

హిమాచల్ ప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’, సిమ్లా జిల్లాకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది.
సోమవారం నుంచి వర్షాల ప్రభావం అధికంగా ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే సిమ్లా నగరం దట్టమైన పొగమంచుతో కప్పబడి ఉండగా, ఆకాశం మేఘావృతమై ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...