వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్తో సహా 10 జిల్లాలకు 'ఎల్లో అలర్ట్' జారీ చేశారు. మరోవైపు, నైరుతి రుతుపవనాల కదలిక మందగించడంతో ఉత్తర తెలంగాణలో ఎండలు కొనసాగుతున్నాయి.
ఆదివారం రామగుండంలో 42.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది.
Comments
Loading comments...

