వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, విపత్తు నిర్వహణ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముందస్తు రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వానలు పడే సూచనలున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

