వార్తలకు తిరిగి వెళ్లండి
మద్దిలేటి క్షేత్రంలో తలనీలాల వేలం

బేతంచెర్ల మండలంలోని మద్దిలేటి నరసింహస్వామి క్షేత్రంలో జరిగిన తలనీలాల బహిరంగ వేలం రూ. 2.03 కోట్లకు ముగిసింది. ఏడాది కాలానికి గాను ఈ హక్కులను మైదుకూరుకు చెందిన సంజయ్ ఎంటర్ప్రైజెస్ రూ. 2,03,94,000కు దక్కించుకుంది.
దేవదాయ శాఖ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ఈ వేలం నిర్వహించినట్లు ఆలయ ఈఓ రామాంజనేయులు వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...