వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటరు జాబితాలో నమోదు: అధికారుల పరిశీలన

డుంబ్రిగూడ మండలంలోని కించుమండ, శివనగరం గ్రామాల్లో తహసీల్దార్ శంకరరావు పర్యటించి, ఓటరు నమోదు ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు.
18 ఏళ్లు నిండిన యువత ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకుని, ప్రజాస్వామ్య బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని గిరిజనులకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, బీఎల్వోలు పాల్గొన్నారు.
Comments
Loading comments...