వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లాలోకి మళ్లీ ఏనుగుల గుంపు ప్రవేశించడంతో ప్రజలు హడలిపోతున్నారు. గరుగుబిల్లి మండలం నవిరి కాలనీ నుంచి అడ్డపుశిలకు వెళ్లే మార్గంలో బుధవారం రాత్రి ఏనుగులు సంచరించినట్లు ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారులు తెలిపారు.
ప్రజలు అటువైపు ప్రయాణించవద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగుల సంచారం కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

