వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని పలు వాగులపై వంతెనల నిర్మాణం ఏళ్లుగా హామీలకే పరిమితమైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోటిగూడ–తపాలాపూర్ వాగుతో పాటు మల్యాల, లోతరే, జన్నారం వాగులపై వంతెనల నిర్మాణం ముందుకు సాగడం లేదు.
ప్రతి వర్షాకాలంలో వాగులు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే వంతెనల నిర్మాణ పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
