Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తిలో అర్ధరాత్రి వరకు గణేష్ నిమజ్జనం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:43 AM అనంతపురంGeneral
గుత్తిలో అర్ధరాత్రి వరకు గణేష్ నిమజ్జనం - Udayam
గుత్తి, గుత్తి ఆర్ఎస్‌లలో బుధవారం అర్ధరాత్రి వరకు గణనాథుల నిమజ్జనం కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐ రామారావు, ఎస్సైలు సురేశ్, అమీర్ ఖాన్ ఆధ్వర్యంలో సివిల్, రిజర్వ్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శ్రీపురం, తురకపల్లి, ఎస్ఎస్ పల్లి వంకలు, చెరువులో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. డ్యాన్సులు చేస్తూ భక్తులు ఉత్సాహంగా నిమజ్జన కార్యక్రమాన్ని ముగించారు.

Comments

G
Loading comments...