వార్తలకు తిరిగి వెళ్లండి

కంది: సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట్–గణేశ్గడ్డ మధ్య 65వ జాతీయ రహదారి పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్ సమీపంలోని చెట్టు పొదల్లో సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.
మృతుడి ఒంటిపై బూడిద రంగు ప్యాంట్, గళ్ల చొక్కా ఉన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

