వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు–కనిగిరి మధ్య డెము ప్యాసింజర్ రైలును ప్రారంభించాలని నరసరావుపేట, ఒంగోలు ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఢిల్లీలో కలిసి కోరారు.
నడికుడి–శ్రీకాళహస్తి రైలు మార్గం కనిగిరి వరకు పూర్తైన నేపథ్యంలో ఈ విజ్ఞప్తి చేసినట్లు ఎంపీలు తెలిపారు. ఈ ప్రతిపాదనపై రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

