Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో డ్రైనేజీలు లేక ప్రగతినగర్ వాసుల అవస్థలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 11, 2026 7:23 PM గుంటూరుGeneral
గుంటూరులో డ్రైనేజీలు లేక ప్రగతినగర్ వాసుల అవస్థలు - Udayam
గుంటూరు ప్రగతినగర్‌ కాలనీ గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదని మంగళవారం సీపీఐ నగర కార్యదర్శి అరుణ్‌కుమార్‌ విమర్శించారు. రోడ్లు, డ్రైనేజీలు లేక మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు,విషసర్పాల బెడద పెరిగిందని, వర్షాలకు కాలనీ జలమయమవుతోందని స్థానిక మహిళలు వాపోయారు. అధికారులు వెంటనే రోడ్లు, సైడ్‌ కాలువలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ప్రజలతో కలిసి నిరాహారదీక్ష చేస్తామని అరుణ్‌కుమార్‌ హెచ్చరించారు.

Comments

G
Loading comments...