వార్తలకు తిరిగి వెళ్లండి

వేల్పూర్ మండలం పచ్చల నడుకుడా గ్రామం నుంచి చెంగల్ వెళ్లే ప్రధాన రహదారి గత కొన్నేళ్లుగా గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ క్షణంలో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

