వార్తలకు తిరిగి వెళ్లండి
గుజరాత్లో వర్షాల బీభత్సం.. 31కి చేరిన మృతులు

గుజరాత్లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల మృతుల సంఖ్య 31కి చేరింది. దక్షిణ గుజరాత్లోని నవసారి (15 మంది), వల్సాడ్ (7 మంది) జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవ్వగా, అత్యధిక మరణాలు నీటమునిగి సంభవించాయని అధికారులు తెలిపారు.
ప్రభావిత ప్రాంతాల నుండి 38,000 మందికి పైగా ప్రజలను తరలించగా, NDRF, SDRF, ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతినడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది.
Comments
Loading comments...