వార్తలకు తిరిగి వెళ్లండి

భీంపూర్ మండలంలోని గుబిడిపల్లి గ్రామానికి కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ భీంరావ్ తెలిపారు. సరైన రహదారి, మురుగు కాలువలు లేక వర్షాకాలంలో అవస్థలు తప్పడం లేదన్నారు. సమస్యలను పలుమార్లు అధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
పిల్లల చదువుల కోసం దూర ప్రాంతాలకు పంపాల్సి వస్తోందన్నారు. వెంటనే రోడ్డు, కాలువలు నిర్మించాలని కోరారు.
Comments
Loading comments...

