వార్తలకు తిరిగి వెళ్లండి
గ్రూప్-2 ఉద్యోగం పేరిట రూ.50 లక్షల మోసం

Photo Gallery
కర్నూలు ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పలువురు బాధితులు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు ఫిర్యాదు చేశారు. గ్రూప్-2 ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బళ్లారి భరత్, శ్రీవాణి అనే వ్యక్తులు రూ.50 లక్షలు వసూలు చేసి మోసగించారని ఆదోని మండలానికి చెందిన ధనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వేదికలో మొత్తం 109 ఫిర్యాదులు రాగా.. లోన్ కట్టినా వేధిస్తున్నారని ఒకరు, భూమి రిజిస్ట్రేషన్ చేసి డబ్బులివ్వలేదని మరొకరు, హనీట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఇంకొకరు ఎస్పీకి విన్నవించుకున్నారు.
Comments
Loading comments...