వార్తలకు తిరిగి వెళ్లండి
కలెక్టరేట్లో కౌలురైతు ఆత్మహత్యాయత్నం

పంట నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ ప్రత్తిపాడుకు చెందిన కౌలురైతు మరియదాసు పురుగు మందు డబ్బాతో గుంటూరు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ కార్యక్రమానికి రావడం కలకలం రేపింది. పోలీసులు అతడిని నివారించి అధికారుల వద్దకు తీసుకెళ్లారు.
మిరప పంట నష్టంతో రూ.15 లక్షల అప్పుల్లో కూరుకుపోయానని, గత ప్రభుత్వం నుండి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. క్షేత్రస్థాయిలో విచారించి న్యాయం చేయాలని కోరాడు.
Comments
Loading comments...