వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడులో వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో కొన్ని గ్రామాల్లో బోర్ల నుంచి నీరు రాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ నీటిమట్టం 529 అడుగులకు చేరింది.
శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి నుంచి విడుదలవుతున్న నీటితో సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సాగర్ కాలువలకు నీరు విడుదల చేస్తే భూగర్భ జలాలు పెరిగి సాగు, తాగునీటికి ఉపయోగపడతాయని ప్రజలు ఆశిస్తున్నారు.
Comments
Loading comments...

